విజయవాడ (అక్షర ప్రళయం)
పోలీసు ఆంక్షలతో అష్ట దిగ్బంధనంలో దుర్గమ్మ ఆలయం.భక్తితో దుర్గమ్మ దీక్షను ముగించుకుని అమ్మవారిని దర్శించుకోటానికి వెళ్ళిన భక్తులకు ఖాకీల ఆంక్షలు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అష్టకష్టాలుపడి మైళ్ళ దూరం గుడికి పోతే అమ్మవారి దర్శనం కంటే ముందు పోలీసుల దర్శనం అవుతుంది. పోలీసుల వినూత్న ఆంక్షలతో భక్తులకు అష్ట కష్టాలు తప్ఫడంలేదు.ఏదో విదంగా అమ్మ దర్శనం ముగించు కోవాలని భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. అమ్మ దర్శనం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.దారులు ముసుకు పోవడంతో భక్తులు సాహసం చేసి కొండ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.పోలీసు వాహనాలకు రాచ మార్గం- భక్తులకు నరక మార్గమా..?ఎలాగైనా అమ్మ దర్శనం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న భక్తులకు ఏమైనా జరిగితే ఎవరిది భాధ్యత.