అక్షర ప్రళయం,డిసెంబర్1( ఉత్తరాంధ్ర బ్యూరో)
బాధిత కుటుంబీకులకు శాసనసభ స్పీకర్ సీఎం సహాయనిది చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు. ఆరు నెలల కూటమి ప్రభుత్వం కాలంలో నియోజకవర్గంలోని 14 మందికి సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించడంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషి చేశారు. నాతవరం మండలం నాతవరం గ్రామానికి చెందిన కొమ్మన శ్రీనివాస్కు 1,80,000, గొలుగొండ మండలం కొత్త ఎల్లవరం గ్రామానికి చెందిన బేబీ ఘనేశ్వరికు 1,53,000 చెక్కులు స్పీకర్ అందించారు.ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడుమాట్లాడుతూ, ఆరోగ్యం దేశాభివృద్ధి మూలస్థంభం. ముఖ్యమంత్రి సహాయనిధి ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ఆశాజ్యోతి కావాలని,ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేందుకు ఈ నిధి దోహదపడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో నాతవరం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి రమణ, అంకంరెడ్డి మాణిక్యం, యర్రా కాశియ్య, కొత్త ఎల్లవరం సర్పంచ్ రాంబాబుపాల్గొన్నారు.