అవినీతిపరుల ఆట కట్టు
ఉత్తరాంధ్ర బ్యూరో ( జనవరి 7) అక్షర ప్రళయం
సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో రాజకీయ నేతల్లో గుబులు మొదలైందనక తప్పదు. అవినీతి అక్రమార్కులు దేశద్రోహులను కొన్ని రాజకీయ పార్టీ నేతలు కాపాడుతూ తమ పబ్బం గడుపుకునేవారు. ఇటువంటి వారి ఆట కట్టించేందుకు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇకనుండి ఏ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపెట్టడానికి వీలు లేకుండా అవినీతి పరులు దేశ ద్రోహులు ఏరివేయడానికి సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సి.బి.ఐ) ముందుకు వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో అవినీతి అక్రమార్కులను ఏరివేసేందుకు దోచుకు వెళ్లే సిబిఐ కు ప్రభుత్వాలు అడ్డుకట్ట వేస్తుండడంతో సిబిఐ అడుగు ముందుకు పడడానికి ఇబ్బందులు తలెత్తేవి. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో సిబిఐ అవినీతి అక్రమార్కుల భరతం పట్టేందుకు అడ్డంకి లేకుండా పోయింది. అయితే కోర్టు తీర్పు వల్ల అవినీతి అక్రమార్కులే కాకుండా వారికి సహకరించే ప్రభుత్వాలు నేతలు తలలు పట్టుకోక తప్పడం లేదనక తప్పదు.