చీడికాడ అక్షర ప్రళయం
సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలో గుట్టు చప్పుడు కాకుండా కోడిపందాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసినీయంగా తెలిసింది. కోర్టు ఆదేశాలు పోలీసుల హెచ్చరికలను పక్కనపెట్టి గుర్తు చప్పుడు కాకుండా పందాలు నిర్వహించేందుకు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి అనంతరం మండలంలో తీర్ధాలు జరగడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. అయితే భోగి, సంక్రాంతి కనుమ పండగల్లో నే కాకుండా తీర్థాల సమయంలో సైతం ఆయా గ్రామాల్లో కోడిపందాలు నిర్వహణకు ఇప్పటినుండి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని పలువురు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. గ్రామాల్లో నిర్వహిస్తే పోలీసులకు పట్టుబడతామని భావించి ఊరి చివరలోనున్న కళ్ళల్లో ద్విచక్ర వాహనాలు వెళ్లే వీలులేని చోట్ల ఈ పందాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. తీర్థాల సమయంలో మైక్ సెట్ లకు అనుమతులు పొంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని చెప్పే గ్రామ పెద్దలు పోలీసులకు తెలియకుండా పోలీసుల కళ్ళుగప్పి గ్రామ శివార్లలో కోడిపందాలు నిర్వహిస్తుంటారు. విషయం తెలిసి పోలీసులు వెళ్లేసరికి దుకాణాలు సర్దేస్తుంటారు. అయితే మండలంలోని ఖండి వరం, అప్పలరాజు పురం, బైలపూడి, దిబ్బపాలెం, వరహాపురం, చుక్కపల్లి, పెద గోగాడ, అర్జునగిరి, చీడిపల్లి, మంచాల, తురువోలు, జైతవరం,తంగుడుబిల్లి,బోయపాడు, గ్రామాల్లో ప్రతి ఏడాది గుర్తు చప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. అయితే ఈ ఏడాది కూడా పలు గ్రామాల్లో కోడిపందాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రధాన గ్రామాల్లో భోగినాడు బంధాల నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే యువకులను గ్రామం నలువైపులా కాపలా పెట్టి పోలీసులు మీడియా వస్తున్నారని విషయాన్ని తెలుసుకుని యువకులు సమాచారం అందిస్తే దుకాణం సర్దేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు పోలీస్ శాఖ ఏ విధంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.