స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద

బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మత్స్య కొండ బాబు

అల్లూరి జిల్లా, ఉత్తరాంధ్ర బ్యూరో

నిత్య స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద అని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాంగి మత్స్య కొండ బాబు పేర్కొన్నారు,సుకూరు పంచాయతీ ములుశోభ గ్రామం లో సమర శత సేవ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ ఐకాన్ స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం లో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు, ముందుగా స్వామి వివేకానంద చిత్ర పటానికి పుప్పాలతో ఘన నివాళులు అర్పించారు, అనంతరం అయన మాట్లాడుతూ భారత దేశ యువత లో స్వామి వివేకానంద వాక్కులు ఎన్నటికీ స్ఫూర్తి నింపుతూనే వుంటాయని అన్నారు, మీరు బలహీనులమని భావిస్తే బలహీనులే అవుతారు, బలమైన శక్తులను భావిస్తే బలమైన శక్తులు గానే ఎదుగుతారు, నిరంతర కృషి తో ఉన్నత శిఖరాలకు ఎదగండి అంటూ అయన యువత లో చైతన్యం నింపేవారని, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ ను స్థాపించిన వివేకానంద భారత దేశం లోని ప్రజల లో జాతీయ భావాన్ని నింపారాని అన్నారు, భారత దేశం లో హిందూ ధర్మం పునరుజ్జివం వెనుక ఆయన ప్రధాన శక్తిగా పరిగనింప బడ్డారని పేర్కొన్నారు, వివేకానంద చికాగోలో ప్రాచత్య ప్రపంచానికి హిందూ ధర్మాన్ని పరిచయం చేస్తూ, 1893 లో చేసిన ప్రసిద్ద ప్రసంగం తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు,స్వామి వివేకానంద జయంతి సందర్బంగా ప్రతి యేటా జనవరి 12 నాడు దేశ వ్యాప్తంగా యువజన దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు, దేశం లో అగ్రభాగం లో వున్నా యువత స్వామి వివేకానంద ను ఆదర్శం గా తీసుకుని దేశ అభివృద్ధి కొరకు వివిధ రంగాల్లో విజయాలు సాధించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎస్ఎస్ఎఫ్ హుకుంపేట మండల ధర్మ ప్రచారక్ పాంగి ప్రభాకర్, మండల మహిళ కన్వినర్ ఉబ్బేటి లక్ష్మి, మండల కమిటీ సభ్యులు సిరగం బెన్నలింగం, చంటి బాబు, రామ్ బాబు, రమేష్, ములుశోభ గ్రామస్తులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *