ఆశ్రమ వాసులకు ఉంగరాలు అందించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
వన్ టౌన్ (అక్షర ప్రళయం)
విశాఖ వన్ టౌన్ ప్రాంతం లో వున్న శ్రీ స్వామి వివేకానంద సంస్థ ఆధ్వర్యంలో స్వామీ వివేకానంద
జయంతోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామి వివేకానంద ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఆశ్రమ వాసులకు బంగారు ఉంగరాలను అందించారు. నిత్యం అన్నదానాలతో, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తున్న వివేకానంద సంస్థ వారిని వంశీకృష్ణ అభినందించారు. చలికాలంలో పేదలకు దుప్పట్లు, సంక్రాంతి పండుగ సందర్భంగా బెల్లం, విద్యార్థులకు ప్లాంకెట్స్ పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను వివేకనంద సంస్థ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సేవా సంస్థ ఆధ్వర్యంలో వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి.ఎం.ఏ. జహీర్ అహ్మద్, కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ వంకాయల. తాతాజీ, టి.డి.పి నాయకులు గండి. బాబ్జి , ఎన్టీఆర్. వైద్య సేవ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సీతం రాజు. సుధాకర్ , 35 వ వార్డు కార్పొరేటర్ వీళ్ళూరి భాస్కర్ రావు, గోడి నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.