పీడీఎస్‌ బియ్యం పట్టివేత…!

నలుగురు నిందితులను అరెస్టు చేసిన 1టౌన్ పోలీసులు..!

పూర్ణ మార్కెట్,(అక్షర ప్రళయం)

ఈ నెల13 వ తేదీన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్ణమార్కెట్, ఆయిల్ మిల్లు సందు సమీపంలో 
అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నట్టు గురువారం ప్రెస్ మీట్ లో వెల్లడించిన ఎసిపి కాళిదాసు..! వివరాల్లోకి వెళ్త సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం… పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్ణమార్కెట్, ఆయిల్ మిల్లు సందు సమీపంలో వేంకటేశ్వరరావు.! పేరు మీద ఉన్న రేషన్ డిపో ను ..వన్ టౌన్ సి.ఐ, స్టేషన్, సిబ్బంది మరియు సివిల్ సప్లయ్ చెకింగ్ ఆఫీసర్ కలిసి రేషన్ డిపోను తనిఖీ చేయగా ఆ డిపోనందు సివిల్ సప్లయ్ వారి ఈపాస్ బుక్ ప్రకారం 44 బస్తాలు (620కేజీలు) ఉండాలి, కానీ 129 బస్తాలు (6450 కేజిలు) ఉన్నవి. అదే సమయంలో రేషన్ డిపో కు ఎదురుగా బొలెరో వాహనంలో 13 బస్తాలు పిడిఎస్ బియ్యం ఉన్నాయని వాటిని నలుగురు వ్యక్తులు అక్రమంగా తరలిస్తుండగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సి.ఐ వారి సిబ్బందితో ఆ నలుగురు వ్యక్తులను చుట్టి ముట్టి పట్టుకొని బొలెరో వాహనంను, 13 ప్లాస్టిక్ బస్తాల పిడిఎస్ బియ్యంను, నలుగురు వ్యక్తులును అడుపులోనికి తీసుకోని విచారించాగ సదురు బియ్యమును ఆక్రముగా తరలిస్తునట్లు తెలియపరిచినారని వారిని అరెస్ట్ చేయడమైనది అని తెలియజేశారు. మరియు వేంకటేశ్వరరావు..! పేరు మీద ఉన్న రేషన్ డిపో లో అదనంగా పిడిఎస్ బియ్యం ఉండడం వలన సివిల్ సప్లయ్ చెకింగ్ ఆఫీసర్ ఆ రేషన్ డిపోను సీజ్ చేయడం జరిగినది అని తెలియజేసారు. కొల్లి లోవరాజు, కర్రి దుర్గారావు, కిల్లి వెంకటరమణ, మునకాల తేజను అరెస్టు చేశారు. వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న రేషన్‌ డిపోను సివిల్‌ సప్లై అధికారులు సీజ్‌ చేసి. 6ఏ కేసును నమోదు చేశారు.ఈ సందర్బంగా సి.పి శంకబ్రత బాగ్జీ
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని అభినందించారు.
విశాఖపట్నం సిటీ ప్రజలకి మీ ఏరియాలో ఇటువంటి అవకతవకలు ఏమైనా జరిగిన వెంటనే  సి.పి ఫోన్ నెంబర్ అయిన 7995095799, లేక వన్ టౌన్ ఇన్స్పెక్టర్  ఫోన్ నెంబర్ అయిన 9440796019 కు తెలియపరచవలసిందిగా విశాఖ పోలీస్ తెలియజేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *