మంత్రి దామోదర్ రాక
రాయికోడ్,(అక్షర ప్రళయం)
మండల కేంద్రమైన రాయికోడ్ లోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయం పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈనెల 20న జరుగనున్నట్లు రాయికోడ్ దేవాలయ ఈవో శివ రుద్రయ్య స్వామి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నర్సింహులు, రాయికోడ్ తాజా మాజీ సర్పంచ్ కేదార్నాథ్ పాటిల్ లు తెలిపారు. ఉదయం 11:30 గంటలకు వీరభద్రేశ్వర ఫంక్షన్ హాల్ లో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి లు హాజరవుతున్నట్లు తెలిపారు చైర్మన్ గా సతీష్ కులకర్ణి, వైస్ చైర్మన్గా గువ్వ భీమన్న, బ్యగరి కృష్ణవేణి. పలువురు డైరెక్టర్లు గా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు