సిహెచ్ శ్రీధర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పద్మనాభం
పద్మనాభం(అక్షర ప్రళయం)
నెహ్రూ యువ కేంద్ర, శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ సంయుక్త నిర్వహణలో యువజన ఉత్సవాలు ముగింపు కార్యక్రమం గోస్తని పాఠశాల ఆవరణలో జరిగాయిస్వామి వివేకానంద 162 వ జయంతి పురస్కరించుకొని జరిగిన యువజన ఉత్సవాలు ముగింపు కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు గాలిపటాల ఎగరవేసే పోటీలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పద్మనాభంమండల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్ శ్రీధర్ ముందుగా వివేకానందుని చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ యువత వివేకానందుని అడుగు జాడలలో నడవాలని దేశ సంపద యువతే అన్నారు ఎంత పంచినా తరగనిది విద్య అని అన్నారు నేటి యువత అసాంఘిక కార్యక్రమాలకి లో ను కాకుండా మత్తుకు బానిసలు కాకుండా విద్యలోనూ క్రీడలలోనూ సామాజిక సేవలోనూ పాల్గొనుచు దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ మానవ సేవ జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ మరియు తమ ట పు నాగమణి రెడ్డిపల్లి శ్రీనివాసరావు పాలూరు కృష్ణారావు మచ్చ సోమేశ్ సిరిపురపు వెంకటరావు కే ఈశ్వరరావు గౌరీ రెడ్డి చొప్ప కృష్ణ మరియు స్కూల్ కరస్పాండెంట్ సూరిబాబు అధిక సంఖ్యలో విద్యార్థినులు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు