ప్రధాని మోడీ కు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు

బి.జె.పి నగర ఉపాధ్యక్షులు చొక్కాకుల రాంబాబు

విశాఖ దక్షిణం,జనవరి:20(అక్షర ప్రళయం)

పలువురు బి జె.పి నాయకులతో కలిసి కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన నగర ఉపాధ్యక్షులు చొక్కాకుల రాంబాబు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు కూటమి ప్రభుత్వంలోని భాగంగా కేంద్ర ప్రభుత్వం 11.440/ వేల కోట్ల రూపాయలు ఆర్ధిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన నగర ఉపాధ్యక్షులు చొక్కాకుల రాంబాబు. ఈ సందర్బంగా రాంబాబు మాట్లాడుతూ…ముఖ్యంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోదీ రాష్ట్ర అభివృద్దికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లుగా చేయడాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.ఈ యొక్క ప్యాకేజీకి  ఆహార్నిశలు కష్టపడి కుటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారి చొరవ మరియు భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం జిల్లా నాయకులు అయినటువంట సెయిల్ డైరెక్టర్ సాగి కాశీ విశ్వనాథరాజు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ప్రస్తుత శాసనసభ్యులు ఉత్తర నియోజకవర్గం  పి విష్ణుకుమార్ రాజు, జిల్లా
నాయకులు..మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థితిగతుల గురించి విన్నవించడం జరిగినది. ఇదే కాకుండా గతంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ వారి ఆధ్వర్యంలో కూడా 10,000 కోట్లు అప్పట్లో ప్యాకేజీ ఇవ్వడం జరిగినది…! అంతేకాకుండా విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భారతీయ జనతా పార్టీ కుటమి ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నోదపాలుగా సహాయ సహకారాలు అందిస్తుఉన్నది. ఇక్కడ అన్ని విధాల ఎన్డీఏ గవర్నమెంట్ సహయ సహకారాలు ఇస్తూనే ఉన్నది. మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత ఒరిస్సా గవర్నర్ అయినటువంటి కంభంపాటి హరిబాబు ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు నుండి విశాఖపట్నం పై అభివృద్ధి విషయంలో దృష్టి పెట్టడం జరిగినది. రైల్వే జోన్ విషయంలో కూడానా ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తొందరగా ఈ యొక్క విషయం పట్టాల పైకి ఎక్కడం జరిగినది. ఇన్ని మంచి పనులు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కహోనా పార్టీ వాళ్లు అవగాహన లేని కొంతమంది చోటామోటా ముఠా నాయకులు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇచ్చినటువంటి ప్యాకేజీ ని అభివృద్ధి పనులకు బాట వేసి ఉత్పత్తిని పెంచి విశాఖ స్టీల్ ప్లాంట్  కి సహాయపడుతుందని ఆశిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో దశమంతల సుశీల  బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు. 37 వార్డ్ మహిళా ప్రెసిడెంట్ జి.రామ తల్లి, బిజెపి నాయకులు డి జే ఎస్ కుమార్, సి హెచ్ సంజీవరావు ,డెస్సి  మొదలగు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *