..సిపి డాక్టర్ శంఖభ్రత బాగ్చీ
వన్ టౌన్, జనవరి;21(అక్షర ప్రళయం)

సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం
కావాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభ్రత బాగ్చీ పేర్కొన్నారు.మంగళవారం స్వామి వివేకానంద జయంతోత్సవాలలో భాగంగా వన్ టౌన్ లో గల వివేకానంద సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు,పెన్నులు, ఫ్లాoక్ లు అలాగే సంస్థ మహిళా సభ్యులకు దేవుని చిత్ర పటాలను అందజేశారు.అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సిపి డాక్టర్ శంఖభ్రత బాగ్చీ మాట్లాడుతూ నిస్వార్థంగా చేసే సేవలే గుర్తింపు ఇస్తాయని అన్నారు.పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు చేదోడు వాదోడుగా నిస్వార్థ సేవలు అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.విశాఖను నేర రహిత నగరంగా తీర్చిదిద్దడానికి పోలీస్ సిబ్బంది తో కలిసి పని చేస్తున్నానని చెప్పారు.ఈ కార్యక్రమానికి ప్రజలు మమేకం కావాలని అన్నారు.ఎక్కడ నేరాలు జరిగిన, అవినీతి అక్రమాలు జరిగిన ప్రజలు తన ఫోన్ నెంబర్ కు నేరుగా పిర్యాదు చేయవచ్చని అన్నారు.లీడర్ దినపత్రిక ఎడిటర్ వి.వి.రమణ మూర్తి మాట్లాడుతూ వివేకానంద స్వచ్ఛంద సంస్థ నిస్వార్థంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.ఈ సంస్థ నిర్వహిస్తున్న ప్రతీ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. స్వామి వివేకానంద ఆశయాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లి ప్రచారం చేస్తున్న ఈ సంస్థకు అభినందనలు తెలిపారు.ఆకలితో ఉన్న పేదలకు ఎంతో రుచికరమైన నాణ్యతతో కూడిన పద మూడు రకాల భోననాలు అందిస్తూ వారి ఆకలిని తీరుస్తూ సమాజ నిస్వార్థ సేవలు అందజేస్తున్నారని వెల్లడించారు.వైకాపా యువ నాయకులు ద్రోణం రాజు శ్రీ వత్సవ మాట్లాడుతూ నిరంతరం ఎటువంటి విసుగు విరామం లేకుండా సామాజిక సేవలతో పాటు పేదలకు , రోగులకు, అన్నార్తులకు సంవత్సరాలు తరబడి డొక్కా సీతమ్మ పేరున అన్నదానంనిరంతరం నిర్వహించడం అందరికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ పోతురాజు, వన్ టౌన్ సిఐ జి.దేవుడు బాబు,పశుపతి,స్వామి, సంస్థ అధ్యక్షులు ఎస్.అప్పారావు, మహిళ సభ్యులు ఉమాదేవి, కనకమహాలక్ష్మి, సుజాత, రత్న, రాణి,ధనలక్ష్మి ,ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.