రాజ్యసభకు శనివారం రాజీనామా.
విజయవాడ స్టేట్ బ్యూరో (ఆక్షర ప్రళయం)
వైసీపీ పార్టీలో కీలక నేత అయిన ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీకి దూరం అవుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.రాజ కీయాల నుంచి తప్పు కుంటున్నా సందర్భంగా రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తానని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.పార్టీకి రాజ్యసభ పదవికి దూరం కావడానికి నా వ్యక్తిగత నిర్ణయమే కారణం నా పై ఎలాంటి ఒత్తిళ్లు లేవు.అలాగని తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని విజయసాయిరెడ్డి అన్నారు.
ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదు.నన్ను ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నా..రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్లు జగన్ అవకాశం ఇచ్చారు.జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నాను.టీడీపీతో రాజకీయంగా విభేదించాను.చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు.పవన్ కల్యాణ్తో చిరకాల స్నేహం ఉందని విజయసాయి తెలిపారు. పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేశాను కేంద్రం, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశను నన్ను ప్రోత్సహించిన మోదీ, అమిత్షాకు ధన్యవాదాలు.ఇకపై నా భవిష్యత్ వ్యవసాయమే అని విజయసాయిరెడ్డి వివరించారు.