విద్యార్థులు చదువుతో పాటు గుడ్ టచ్ అండ్ బ్యాడ్
టచ్, సైబర్ నేరాల పై అవగాహన పెంపొందించుకోవాలి
వన్ టౌన్ సి.ఐ జి.డి.బాబు..
వన్ టౌన్, జనవరి:25(అక్షర ప్రళయం)

విశాఖ దక్షిణ నియోజకవర్గం వన్ టౌన్ ప్రాంతంలో వున్న క్వీన్ మేరీ హై స్కూల్ నందు… సుమారు వెయ్యి మంది విద్యార్థులకు అవేర్నెస్ కార్యక్రమం
వన్ టౌన్ సి.ఐ జి.డి బాబు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ జి.డి.బాబు మాట్లాడుతూ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేయడం జరిగింది. సైబర్ క్రైమ్ గురించి మరియు బాగా చదువుకోవాలని తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించాలని చెప్పడం జరిగింది.సెల్ ఫోన్ ఎక్కువగా వాడ రాదని, ఎవరైనా రాగింగ్ కి పాల్పడిన ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నించిన వెంటనే తనకు (జీడీ బాబు ఇన్స్పెక్టర్) కి తెలియజేయాలని సూచించడం జరిగింది. త్వరలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఉన్నత ఆశయాలను సాధించాలంటే చదువు ఒకటే మార్గం అని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ జి.డి బాబు తెలియజేయడం జరిగింది.ఏదైనా సమస్య వచ్చినట్లయితే 24/7 ఎప్పుడైనా ఇన్స్పెక్టర్ పోలీస్ 9440796019 ఫోన్ చేస్తే తగిన సహాయ సహకారాలను అందిస్తామని.. పోలీస్ సేవలు వినియోగించు కోవాలని తెలియజేయడం జరిగింది.