వన్ టౌన్, జనవరి:26(అక్షర ప్రళయం)

క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్డ్స్ ప్రధానోపాధ్యాయులు వర్మ మాట్లాడుతూ.. మన స్వాతంత్ర్య సమర వీరుల త్యాగాలు గుర్తుచేసుకొని క్రమశిక్షణలో దేశ ప్రగతికి తోడ్పడాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.. తదనంతరం సంధ్యారాణి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణంలో మహిళల కృషి గురించి వివరించారు. విద్యార్థులు దేశభక్తి గేయాలు ఆలపించిరి. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు ఉమ, ధర్మేంద్రరెడ్డి పాఠశాల కమటి చైర్మన్ ప్రశాంతి తదితరులు పాల్గోన్నారు.