హనుమకొండ జిల్లా(అక్షర ప్రళయం)
హన్మకొండ జిల్లా ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన సంవత్సర -2025 క్యాలెండర్ ను టీడబ్ల్యూజేఏ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ డీపీఆర్ఓ జీవీ భాను ప్రసాద్ ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భానోతు వెంకన్న నాయక్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఏ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హుస్సేన్ నాయక్, టీడబ్ల్యూజేఏ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దేవేందర్ నాయక్, కోశాధికారి భూక్యా సిద్దు నాయక్, భూక్యా శ్రావణ్ నాయక్, లావుడియా రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.