విశాఖ రైల్వే స్టేషన్ లో గంజాయి పట్టివేత ..!

విశాఖపట్నం,(అక్షర ప్రళయం)

ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో బాగముగా,  విశాఖపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ పి.రామచందర్ రావు సూచనలు ప్రకారం విశాఖపట్నం జి ఆర్ పి ఇన్స్పె క్టర్  సి హెచ్ ధనంజయనాయుడు  ఆద్వర్యం లో  సబ్-ఇన్స్పెక్టర్ ఎస్ కె అబ్దుల్ మారూఫ్ మరియు /అర్.పి.ఎఫ్/ ఏ.ఎస్.ఐ పిమ్ కుమార్ వారి సిబ్బంది తో కలిసి  విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం లలో ముమ్మర తనికీలు చేస్తుండగా రాయగడ జిల్లా, ఒడిష రాష్ట్రం కు చెందిన  ఏ.1. సుశాంత్ నాగ్ మరియు ఏ.2. రాజకుమార్ నాగ్ లను విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా  త్రిస్సూర్ జిల్లా, కేరళ రాష్ట్రం కు గంజాయి ని అక్రమముగా రవాణా చేయుచుండగా వారిని అదుపులోకి తీసుకొని, వారి నుండి 36 వేల
విలువగల 7.2  కేజీల గంజాయి ని  సీజ్ చేసి, వారిని  సబ్-ఇన్స్పెక్టర్ ఎస్ కె అబ్దుల్ మారూఫ్ కు అందచేసినారు. సబ్-ఇన్స్పెక్టర్ ఎస్ కె అబ్దుల్ మారూఫ్ వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు లో హాజరు పరచినట్లు అలాగే సదరు మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను వెలికితీయడంలో విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీస్ మరియు ఆర్పీఫ్ ఫోర్స్ వారు ప్రత్యేక టీం ల సహాయంతో నిఘా వర్గాలను ఏర్పా టు చేసి, విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి మరియు సింహాచలం రైల్వే స్టేషన్ పరిధిలో తనిఖీలు ముమ్మరముగా చేస్తున్నట్లు  తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *