గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్
విశాఖపట్టణం,(అక్షర ప్రళయం)

మహాత్మా గాంధీజీ జీవిత చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. అహింసా మార్గంతో స్వాతంత్ర్య సాధనలో అమోఘమైన పాత్ర పోషించారని కొనియాడారు. మహాత్ముని ప్రస్తావన లేకుండా దేశ చరిత్ర ఉండదని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గాన్ని అందరూ అనుసరించడమే నిజమైన నివాళిగా కలెక్టర్ అభివర్ణించారు. గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మహాత్ముడు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, ఏవో ఈశ్వరరావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.