- దక్షిణ వైసిపి సమన్వయకర్త వాసుపల్లికి ఘనసత్కారం…
- దక్షిణంలో పలువురికి వరించిన పార్టీ పదవులు.
విశాఖ దక్షిణం, జనవరి:30(అక్షర ప్రళయం)
ప్రజలు ఆశీస్సులతో మళ్ళీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ స్పష్టం చేశారు. వైసీపీ పార్టీ కోసం కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు అధిష్టానం పలు అధ్యక్ష పదవులను అందించిందన్నారు. ఈ మేరకు దక్షిణ నియోజకవర్గంలో నూతనంగా అధ్యక్ష పదవులకు నియామకమైన పలువురు పార్టీ శ్రేణులు గురువారం వాసుపల్లి గణేష్ కుమార్ ని కలిసి గజమాలతో సత్కరించి జై జగన్.. జై వాసుపల్లి అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో పార్టీ కష్ట కాలంలో కూడా శ్రమిస్తున్న పలువురి వైసిపి నాయకులను కార్యకర్తలను గుర్తించి అధిష్టానానికి సిఫార్సు చేశారు. ఈ మేరకు జిల్లా వైసీపీ ఇటీవల విడుదల చేసిన పలు పదవులకు దక్షిణం నుండి విశాఖ జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భారత్ , సౌత్ బూత్ లెవెల్ ప్రెసిడెంట్ ముజుబ్ ఖాన్, వైయస్సార్ టిఎన్టియుసి అధ్యక్షులు రాజ్ పాత్రుడు, సౌత్ బిసి సెల్ అధ్యక్షులు బొండాడ వెంకటరమణ, సౌత్ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ షకిల్, సౌత్ మహిళా విభాగం అధ్యక్షులు వాసుపల్లి బంగారమ్మ, సౌత్ అంగనవాడి వింగ్ అధ్యక్షులు కొంతాల కృష్ణవేణి, సౌత్ సోషల్ మీడియా అధ్యక్షులు మహేష్, సౌత్ వాణిజ్య విభాగం అధ్యక్షులు కడియం ప్రసాద్, సౌత్ మున్సిపల్ వింగ్ అధ్యక్షులు గోరపాటి శివ ఎన్నికయ్యారు. వీరంతా వాసుపల్లి గణేష్ కుమార్ తో కలిసి పార్టీ అభివృద్ధికి, ప్రజల సమస్యలతో నిరంతరం కృషి చేయడం గుర్తించడంతో పలు పదవులు వరించాయి. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయడం వైకాపా కి కొత్త ఏమీ కాదన్నారు. కూటమి ప్రభుత్వం అబద్దాలతో అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు గడిచినప్పటికీ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేక పోయిందన్నారు. పైగా జగనన్న నేరుగా అందించిన పథకాలు, సచివాలయాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వాలంటీర్లకు 10,000 పెంచుతామంటూ ఉద్యోగాల్లోంచి తీసేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ కొట్టలేని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటల గారీడీతో మభ్యపెడుతుండడం ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. అందుకే మళ్ళీ జగనన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. మళ్లీ వైసీపీకి పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.