విశాఖపట్నం, (అక్షర ప్రళయం)
ఫిబ్రవరి1వ తేదీన, స్వర్గీయ. ద్రోణం రాజు. శ్రీనివాస్ గారి 64వ జయంతి సందర్భంగా, శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద సంస్థ వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి శ్రీనివాస్ తనయులు శ్రీవాత్సవ పత్రాలను విడుదల చేశారు. శ్రీవత్సవ మాట్లాడుతూ, ఈ వైద్య శిబిరంలో అన్ని కంటి వ్యాధులకు ఉచితంగా కంటి పరీక్షలు జరుపబడును, కాటరాక్ట్ శాస్త్ర చికిత్సలు, కంటిమీద కండ, మెల్లకన్ను సరి చేయుట అందరికీ కూడా ఉచిత వైద్య పరీక్షలు అందించబడును , అందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవలసినదిగా శ్రీవాత్సవ్ కోరారు. ద్రోణం రాజు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా వివేకానంద సంస్థ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, క్యాంపు కోఆర్డినేటర్ వై. రాజు, ప్రసాద్, కాలా. సూర్య ప్రకాష్ మరియు మహిళా సభ్యులు పాల్గొన్నారు.