ఉచిత కంటి వైద్య శిబిరానికి కరపత్రాలు విడుదల చేసిన ద్రోణం రాజు.శ్రీ వాత్సవ్

విశాఖపట్నం, (అక్షర ప్రళయం)

ఫిబ్రవరి1వ తేదీన, స్వర్గీయ. ద్రోణం రాజు. శ్రీనివాస్ గారి 64వ జయంతి సందర్భంగా, శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద సంస్థ వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి శ్రీనివాస్ తనయులు శ్రీవాత్సవ పత్రాలను  విడుదల చేశారు. శ్రీవత్సవ మాట్లాడుతూ, ఈ వైద్య శిబిరంలో అన్ని కంటి వ్యాధులకు ఉచితంగా కంటి పరీక్షలు జరుపబడును,  కాటరాక్ట్ శాస్త్ర చికిత్సలు, కంటిమీద కండ, మెల్లకన్ను సరి చేయుట అందరికీ కూడా ఉచిత వైద్య పరీక్షలు అందించబడును , అందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని  ఉపయోగించుకోవలసినదిగా శ్రీవాత్సవ్ కోరారు. ద్రోణం రాజు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా వివేకానంద సంస్థ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు, క్యాంపు కోఆర్డినేటర్ వై. రాజు, ప్రసాద్, కాలా. సూర్య ప్రకాష్ మరియు మహిళా సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *