నేడు వాసవీమాతకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

ప.గో.జిల్లా, పెనుగొండలో భారీగా ఏర్పాట్లు..

న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)

ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం పర్యటించనున్నారు. నేడు నిర్వహించనున్న కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికార కార్యక్రమంగా జరపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా అక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో సీఎం పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సమీపంలోని వాసవీధాంను సందర్శించి 90 అడుగుల వాసవీ అమ్మవారి పంచలోహ విగ్ర హానికి పూజలు చేస్తారు.

ముఖ్యమంత్రి షెడ్యూలు ఇలా..

▪️ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.05కు పెనుగొండలోని ఏఎంసీలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
▪️అనంతరం 11.10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 11.15కి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
▪️11.45కి రోడ్డు మార్గాన బయలుదేరి 11.50 గంటలకు వాసవీ శాంతిధామ్ కు చేరుకుని గురుపీఠం శిలాఫలకం ఆవిష్కరిస్తారు.
▪️12.10కి బయలుదేరి 12.15కి పెనుగొండ ఏఎంసీలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
▪️మధ్యాహ్నం 12.20కి బయలుదేరి 12.55కి ఉండవల్లికి చేరుకుంటారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *