ప.గో.జిల్లా, పెనుగొండలో భారీగా ఏర్పాట్లు..
న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)
ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం పర్యటించనున్నారు. నేడు నిర్వహించనున్న కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికార కార్యక్రమంగా జరపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా అక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో సీఎం పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం సమీపంలోని వాసవీధాంను సందర్శించి 90 అడుగుల వాసవీ అమ్మవారి పంచలోహ విగ్ర హానికి పూజలు చేస్తారు.
ముఖ్యమంత్రి షెడ్యూలు ఇలా..
▪️ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.05కు పెనుగొండలోని ఏఎంసీలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
▪️అనంతరం 11.10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 11.15కి కన్యకా పరమేశ్వరి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
▪️11.45కి రోడ్డు మార్గాన బయలుదేరి 11.50 గంటలకు వాసవీ శాంతిధామ్ కు చేరుకుని గురుపీఠం శిలాఫలకం ఆవిష్కరిస్తారు.
▪️12.10కి బయలుదేరి 12.15కి పెనుగొండ ఏఎంసీలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
▪️మధ్యాహ్నం 12.20కి బయలుదేరి 12.55కి ఉండవల్లికి చేరుకుంటారు.