విశాఖ దక్షిణం, జనవరి:31(అక్షర ప్రళయం)
వైకాపా జిల్లా బీసీ అధ్యక్షులు సనపల ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆశీలమెట్ట కార్యాలయంలో శుక్రవారం ఉదయం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. వాసుపల్లి గణేష్ కుమార్ కేక్ కటింగ్ చేసి సనపల భారత్ కి తినిపించారు. అనంతరం దక్షిణ వైసీపీ శ్రేణులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సనపల భరత్ మాట్లాడుతూ దక్షిణ ప్రజల ఆపద్బాంధవుడు, నేతలకు కార్యకర్తలకు అండగా.. అన్నగా నిలిచే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు ముందుగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన అధికారంలోకి మళ్లీ రావాలని కోరుకుంటున్న ప్రజల ఆకాంక్ష నెరవేరాలన్నారు. నిరంతరం ప్రజలతోనే ఉంటూ ప్రజలకు సేవ చేసే వాసుపల్లి గణేష్ కుమార్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని సనపల భరత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సకల భక్తుల ప్రసాదరావు 29 వార్డు అధ్యక్షులు పీతల వాసు, 33 వార్డ్ అధ్యక్షులు ఎమ్ రమేష్, 42 వార్డ్ అధ్యక్షులు బీసెట్టి ప్రసాద్, 39 వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్, దక్షిణ నియోజకవర్గం వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు తాడి రవితేజ, బెవర మహేష్, ఆకుల శ్యామ్, సూర్య, కంటుమిచ్చు సాగర్ శివ తదితరులు పాల్గొన్నారు.