సి. ఐ. జి.డి.బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

వన్ టౌన్, జనవరి:31(అక్షర ప్రళయం)

ఎం.వి.డి.ఎం హై స్కూల్ నందు శుక్రవారం
సుమారు 500 మంది విద్యార్థులకు అవేర్నెస్ కార్యక్రమాన్ని విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తో కలిసి నిర్వహించిన ఇన్స్పెక్టర్ జి.డి.బాబు.  ఈ కార్యక్రమంలో భాగంగా పలు అవగాహన అంశాల పై మాట్లాడుతూ ..గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేయడం జరిగింది. పసి పిల్లలు బాడ్ టచ్ జరిగితే తల్లితండ్రులకు చెబితే వారు తిడతారేమో అని ..భయపడి చెప్పడంలేదన్నారు. పిల్లలు ధైర్యంగా తల్లి తండ్రులకు కానీ, టీచర్లకు కానీ పోలీసులకు కానీ తెలియజేయలన్నారు.సైబర్ క్రైమ్ గురించి మరియు బాగా చదువుకోవాలని తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించాలని చెప్పడం జరిగింది. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, గురువులను గౌరవించాలని , డ్రెస్ కోడ్ పాటించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడ రాదని, ఎవరైనా ర్యాగింగ్ కి పాల్పడిన ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నించిన వెంటనే జీడీ బాబు ఇన్స్పెక్టర్ కి తెలియజేయాలని సూచించడం జరిగింది. త్వరలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నందున పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఉన్నత ఆశయాలను సాధించాలంటే చదువు ఒకటే మార్గం అని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ జి.డి బాబు  తెలియజేయడం జరిగింది.ఏదైనా సమస్య వచ్చినట్లయితే 24/7 ఎప్పుడైనా ఇన్స్పెక్టర్ పోలీస్ 9440796019 ఫోన్ చేస్తే తగిన సహాయ సహకారాలను అందిస్తామని.. పోలీస్ సేవలు వినియోగించు కోవాలని తెలియజేయడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *