స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావుకు ఘన నివాళి

విశాఖ దక్షిణం,(అక్షర ప్రళయం)

మాజీ శాసనసభ్యులు, మాజీ వి.ఎం.అర్.డి.ఏ
చైర్మన్, స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు 64వ జయంతి సందర్భంగా ఉదయం నుండి 1టౌన్ ప్రాంతంలో ఉన్న శ్రీ స్వామి వివేకానంద సంస్థ వద్ద శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి  సహకారంతో ద్రోణంరాజు శ్రీవత్సవ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది కంటి పరీక్షలు చేయించుకోగా సుమారు 60 మందికి ఉచితంగా సర్జరీ చేయించారు..
ఈ కార్యమనికి ముఖ్యాతిధులుగా మాజీ మంత్రి వైస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాధ్,నగర మేయర్ గోళగాని హరి వెంకట కుమారి , శాసనమండలి సభ్యులు వరుదు కల్యాణి , జిల్లా మహిళ అధ్యక్షులు పేడాడ రామణికుమారి , మాజీశాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, స్వామి వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డా”జహీర్ అహ్మద్, మాజీ వుడా చైర్మన్ పి యస్. ఎన్ రాజు ,బేహారా భాస్కరరావు ,కార్పొరేటర్లు తోట పద్మావతి,మాసిపోగు రాజు, బిపిన్ జైన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కొండా రాజీవ్ గాంధీ, వంకాయల తాతాజి,మాజీ కార్పొరేటర్లు జగ్గూపిల్ల అప్పలరాజు, కొప్పల వెంకటరావు, సంస్థ అధ్యక్షులు సురాడా అప్పారావు,మళ్ళ బుజ్జి, వార్డు ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల నాయకులు, దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు మరియు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *