ప్రభుత్వ ఖజానాకు 2 రోజుల్లో 220 కోట్లు.
అనధి కారికంగా లక్షల్లో చేతులు మార్పు.
అమరావతి స్టేట్ బ్యూరో (ఆక్షర ప్రళయం)
ఏపీ రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి.కొత్త చార్జీలు నుంచి తప్పిం చుకునేందుకు గురువారం నుంచి శుక్రవారం రాత్రి 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 14250 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం.ప్రతీ రోజు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో రెండింతలు పెరిగి 170 వరకు రిజిస్ట్రే షన్లు జరిగాయి.అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రే షన్లు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.220 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక అనధికారికంగా కూడా లక్షల్లో చేతులు మారాయని తెలుస్తోంది. ఆంక్షలు లేకుండా పనులు త్వరగా పూర్తి చేయాలి అంటే చేతులు తడ పక తప్పలేదని కొందరు బహిరం గంగా చెప్పడం గమనార్హం.అదికార్లు సిబ్బంది దళారీలు రెండు రోజుల్లో పుష్కలంగా పోగేసు కున్నారని సమాచారం ఉంది.