“వాసుపల్లి” కార్యాలయంలో సందడే సందడి

  • దక్షిణ వైసీపీ శ్రేణుల్లో పుట్టినరోజు పండగ హేళ…
  • అభిమానులు, యువతతో కలిసి రక్తదానం చేసిన వాసుపల్లి…
  • మాజీ ఎమ్మెల్యేకు సర్వమత పెద్దలతో “శతమానం భవతి”
  • గణేష్ కుమార్ కి పూల హారతితో ఘన స్వాగతం…

విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)

దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఆయా కార్యాలయాల్లో ఆదివారం ఉదయం ఘనంగా జరిగాయి. ఆశీల్లమెట్ట  కార్యాలయం వద్ద 29, 30, 31 33, 39, 42, వార్డుల అధ్యక్షులు పీతల వాసు, దశమంతల మాణిక్యాలరావు, దొడ్డి బాపు ఆనంద్, ముక్తా బత్తుల రమేష్, ముజీబ్ ఖాన్, బీశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో వాసుపల్లి కి పూల హారతితో ఘనస్వాగతం పలికారు. ముందుగా గజమాలతో సత్కరించి 61 కేజీల భారీ కేక్ కటింగ్ చేసి వాసుపల్లి కి పుట్టినరోజు శుభాకాంక్షలు ముక్తకంఠంతో తెలిపారు. అనంతరం సర్వమత పెద్దలు హాజరై ప్రార్థనలు చేసి వాసుపల్లి కి ఆశీర్వచనాలు అందజేశారు.


అమ్మ బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరు వార్డుల అధ్యక్షుల సారధ్యంలో రక్తదాన శిభిరం నిర్వహించారు. 104 కార్యాలయంలో ఏర్పాటు చేసినా రక్తదాన శిబిరంలో అభిమానులు, యువత తో  కలిసి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా రక్తదానం చేయడం విశేషం.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ  భవిష్యత్తులో వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నత పదవులు అధిరోహించి మరింత మందికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. 20 ఏళ్లుగా పరోక్షంగా రాజకీయాల్లో ఉంటూ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా దక్షిణ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు, కార్యకర్తలకు అందించిన సేవలు గుర్తు చేసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ పెద్దలకు, నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ప్రేమ కురిపించిన ప్రతి ఒక్కరికి ఊపిరి ఉన్నంతవరకు సాయం మందిస్తానని వెల్లడించారు. నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇటీవల విడుదల చేసిన స్టీల్ ప్లాంట్ నిధులు కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే సరిపోయినప్పటికీ, ఏపిలో కూటమి నేతలు మాత్రం సమస్య అంతా తీరిపోయినట్టు భజనలు చేయడం విడ్డూరమన్నారు. అదే మాదిరిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా తూతూ మంత్రంగా చేతులు దులుపుకున్నప్పటికి చంద్రబాబు, పవన్ ల భజన బృందం బడ్జెట్ అద్భుతంగా ఉన్నట్లు ప్రచారం చేయడం సిగ్గుచేటు అన్నారు.  ప్రజలు అంత గమనిస్తున్నారని, భవిష్యత్తులో మళ్లీ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వైసిపి నాయకులు కొండా రాజీవ్ గాంధీ, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, మూగి శ్రీనివాస్, దొడ్డి కిరణ్,  జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భారత్,  కార్పొరేటర్లు చెన్నా జానకిరామ్, తోట పద్మావతి, వార్డు అధ్యక్షులు కనక రెడ్డి,సర్వేశ్వర్ రెడ్డి, దశమంతుల చిన్ని, దొడ్డి రామానంద్, వాసుపల్లి బంగారమ్మ, లింగం శీను, తాడి రవితేజ, మహమ్మద్ షకీల్, మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అప్పారావు, వాసర్ల సుబ్రహ్మణ్యం, పిల్లి అప్పారావు, గనగల్ల రామరాజు, డేవిడ్ రాజు, బెవర మహేష్, సూర్య, కొణతాల కృష్ణవేణి, సుధా బోరా శ్రీనివాస్ రెడ్డి, పాటోజు అర్జున్, గురజాపు రవి చింతకాయల వాసు,ఆకుల యేసు,నొల్లు పోతు స్వామి రామబాణం కళాశాల సిబ్బంది కార్యకర్తలు అభిమానులు , అధిక సంఖ్యలో పాల్గొని వాసుపల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *