భవన నిర్మాణ వెల్ఫేర్‌ బోర్డును పునరుద్ధరించాలి

‘జనవాణి’లో ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం నేతల వినతి

అమరావతి,ఫిబ్రవరి:5(అక్షర ప్రలే)

భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్‌ బోర్డును తక్షణమే పునరుద్ధరించి, పెండిరగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ను పరిష్కరించాలని, వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ అనుబంధం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన ‘జనవాణి’లో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ విప్‌, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి పడాల రమణ నేతృత్వంలో నేతలు అనేక విజ్ఞప్తులు చేశారు. అందుకు స్పందించిన బొలిశెట్టి వెంటనే కార్మికమంత్రి వాసంసెట్టి సుభాష్‌తో మాట్లాడారు. ఐఏఎస్‌ అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తాడేపల్లిగూడెం సభలోనే హామీ ఇచ్చారని, ఈ సందర్భంగా బొలిశెట్టి గుర్తు చేశారు. శ్రీనివాస్‌ యూనియన్‌ నాయకులతో అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎస్‌.వెంకట సుబ్బయ్య, యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ (బుజ్జి), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్‌, సంఘం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *