బీజేపీకి కొండంత బలాన్ని ఇచ్చిన ఢిల్లి ఫలితాలు

విశాఖ బీజేపీ అధ్యక్షుడు పరశురామ రాజు

విశాఖపట్నం, (అక్షర ప్రళయం)

ఢిల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొండంత బలాన్నిచ్చా యని విశాఖపట్నం జిల్లా ఎంఎంఎన్ పరశురామ రాజు పేర్కొన్నారు విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా నగరంలోని లాసన్స్ బే కాలని బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసు కున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలోనే అతి కీలకమైన ఢిల్లిలో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో నగర బిజెపి శ్రేణులు స్వీట్లు పంచుకుంటూ ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపు కున్నారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎంఎల్సి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వికషిత్ భారత్ వైపు వడి వడిగా అడుగులు వేస్తోందని ఈ కీలక తరుణంలో డిల్లి విజయం తమకు గట్టి ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చిం దన్నారు మోడీ నేతృత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం సుస్థిర మైన అభివృద్ధి సాధిస్తూ సమర్ధ వంతమైన పరిపాలన అందించ డంతో దేశమంతా పార్టీ పట్ల అభి మానం వెల్లివిరుస్తోందన్నారు 27 సంవత్సర సుదీర్ఘ విరామం తరువాత 48 శాతం పైగా ఓట్లతో అపూర్వ విజయం సాధించడం శుభ పరిణామ మన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ బిజెపి పార్లమెంట్ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, బీజేపీ సీనియర్ నాయకులు నాగేంద్ర,సుహాసిని ఆనంద్,కూరాడ పావని, పలువురు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *