విశాఖ తూర్పు, (అక్షర ప్రళయం)
ఏపీ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విశాఖ శివాజీ పార్క్ లోని తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర కార్యదర్శి జేవి మోహన్ గౌడ్ పిలుపు మేరకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ పూతి వెంకటరెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ మొదటి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరి 6న రిలీజయిందన్నారు .ఫిబ్రవరి 6 వ తేదీనే తెలుగు సినిమా దినోత్సవంగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిందన్నారు. రాబోయే రోజుల్లో మహావృక్షంగా మారి అందరికీ తెలుగు సినిమా గొప్పదనం తెలిసేలా సినిమా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమను ఏపీలో ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను స్థాపించబడిందని చెప్పారు. హైదరాబాదుకు దీటుగా ఏపీలోనూ చిత్ర పరిశ్రమను విస్తరింపజేయడానికి ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కృషి చేస్తోందన్నారు. షూటింగులను ప్రోత్సహించడం, ప్రభుత్వ పరంగా రాయితీ పై నిర్మాతలకు అవగాహన కల్పించడం, త్వరలో జిల్లాలో కళాకారులకు వృత్తి నైపుణ్యం పెంచడంపై శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వెంకటరెడ్డి తెలిపారు. ఏపీలో సినీ స్టూడియో నిర్మించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుందన్నారు. జిల్లాలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి కృష్ణకిషోర్, విశాఖ జిల్లా అధ్యక్షుడు రమేష్ యాదవ్, కార్యదర్శి బాబుదేవ్ తో పాటు నగరానికి చెందిన కళాకారులు గోపినాయుడు, అవినాష్, నవ్వుల దామోదర్, సౌమ్య విజయలక్ష్మీ, జీటీ రాజు, వెంకట్, రాజశేఖర్, అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొన్నారు.