విశాఖపట్నం, (అక్షర ప్రళయం)
ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గోలి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ పి.వి.మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం బీజేపీ నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ విజయం నాయకులు, కార్యకర్తల సమష్టి కృషి అని.. విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.బీజేపీ పాలనలో దేశంలో, రాష్ట్రంలో సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలియజేశారు.
మాజి ఎమ్మెల్సి మాధవ్ మాట్లాడుతూ ఈ విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఓటర్లు దేశ ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధి కోసం ఆలోచించారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మారని అందుకే నమ్మకంతో ఓటేశారు అని అన్నారు. విజయం పట్ల కార్యకర్తలు ఎంతో శ్రమించారని, వారికి అభినందనలు తెలిపారు.