విశాఖపట్నం, (అక్షర ప్రళయం)
విశాఖ జిల్లా మరియు రాష్ర్ట బి జె పి మైనారిటీ మోర్చా నాయకులు, జిల్లా నూతన అధ్యక్షులు ఎం ఎం ఎన్ పరశురామ్ రాజు ని కలసి మెమొరాండం కాపీ సమర్పించడం జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా జి వి యం సి లో చర్చలకు మాత్రమే పరిమితమై వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికల ఫైలు పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఇదే మెమొరాండం గత నెలలో ఎమ్మెల్యే పెనుమత్స విష్ణు కుమార్ రాజు కి సమర్పించినట్లు తెలియ జేయడమైనది. పార్టీ పరంగా ఈ విషయమై తగు సిఫార్సు చేయుటకు విన్నవించడం జరిగింది. ఈ కార్యక్రమములో రాష్ట్ర బీజేపీ మైనారిటీ మోర్చా సీనియర్ నాయకులు సర్వశ్రీ ఓ ఆల్బర్ట్, డా. వారా జాకబ్, సి.హెచ్.రాజు బాబు, జిల్లా మైనారిటీ ఇన్చార్జి దానేష్ మరియు జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షురాలు టి. భారతి మరియు మహిళా మోర్చా నాయకు రాండ్లు పాల్గొన్నారు.