ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్..!

పోలీస్ మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు.

ఎన్ కౌంటర్లో 31మంది మావోయిస్టుల మృతి.

మావోల తూటలకు ఇద్దరు జవాన్లు బలి.

2026 మార్చి నాటికి నక్సలిజం అంతం.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘటన

ఛత్తీస్ ఘడ్ సెంట్రల్ డెస్క్(అక్షర ప్రళయం)

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.బీజాపూర్ జిల్లాలో తూటల మోత దద్దరిల్లింది.మావోయి స్టుల సమాచారంతో భద్రతా బలగా లు గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టులు తార్స పడటంతో భద్రతా బలగాలు కాల్పులు చేపట్టా రు.ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టుల
కు భారీ ఎదురు దెబ్బ తగిలింది.31 మంది మావోయిస్టులు హతమయ్యా రు.అలాగే మావోల తూటలకు ఇద్దరు జవాన్లు మృతి చెందారు.ఈ ఎన్ కౌంటర్లో భారీ ఎత్తున మావోయిస్టులు హతం కావడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇది భద్రతా బలగాలకు అతి పెద్ద విజయం అన్నారు.
మావోయిస్టులకు ఇవాళ అతి భారీ నష్టం జరిగింది. ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 31 మంది నక్సల్స్ మృతి చెందగా బీజాపూర్ జిల్లాలో కాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా మరణించారు. ఈ ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లా డుతు”భారత్ నక్సల్స్ రహిత” దేశంగా మార్చే దిశలో భద్రతా బలగాలు బీజాపూర్ లో అతి పెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్ లో 31 మంది నక్సలైట్లు మరణించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి” అని అమిత్ షా సోషల్ మీడియాలో వివరించారు.
ఎన్ కౌంటర్ లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందడంపై అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.మానవ వ్యతి రేక నక్సలిజంను అంతమొందించడం లో ఇద్దరు ధైర్యశీలులైన జవాన్లను కోల్పోయాం అని తెలిపారు. ఇటువంటి అమరవీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మరణించిన జవాన్లకుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అమిత్ షా వివరించారు.ఇక, 2026 మార్చి 31 లోపే దేశంలో నక్సలిజంను రూపుమాపుతామని పునరుద్ఘా టించారు. తద్వారా దేశంలో ఏ పౌరుడు నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోయేపరిస్థితి ఉండదని స్పష్టం చేశారు.కాగా ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *