ప్రసాదాన్ని పంపిణీ చేసిన “ఓల్డ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్”
పూర్ణ మార్కెట్, (అక్షర ప్రళయం)

దక్షిణ నియోజకవర్గం లో 36వ వార్డ్, రంగిరిజువిది లో వెలసిన వున్నా శ్రీశ్రీశ్రీ నీలమాంబ అమ్మవారి 43వ పరస సందర్బంగా శ్రీ నీలమాంబ సేవాసమాజం స్థానికులతో కలిసి పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది. 10వ తేదీ న అనగా సోమవారం తొలిలేళ్ళు జరిగింది.ఈ సందర్బంగా శ్రీ అమ్మవారి ఉత్సవ విగ్రహం తో పల్లకి ఊరేగింపు, 108 ఘటాలతో ఊరేగింపు.అనంతరం పంచామృత అభిషేకం, భక్తులచే 108 ఘట్టాలతో అభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. మంగళవారం
పరస సందర్బంగా విశేష పూజా కార్యక్రమం
జరిగింది. భక్తులు విచ్చేసి పసుపు,కుంకుమ సమర్పించుకొని అమ్మవారి ఆశీర్వధాన్ని పొందారు. ఈ సదర్భంగా ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయంత్రం అమ్మవారి ప్రసాదం పంపిణి చేయడం జరిగింది. ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమంలో కే.ఎం.కీర్తన, కార్యదర్శి పి.అర్జున్, సీనియర్ రిపోర్టర్ ధనుష్,రిపోర్టర్ సురేష్,రిపోర్టర్ సతీష్ పలువురు రిపోర్టర్లు పాల్గొన్నారు.