గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై ప్రత్యేక షీట్స్ తయారు చేయాలి

విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి

విశాఖపట్నం, ఫిబ్రవరి:19(అక్షర ప్రళయం)

విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఐపిఎస్ అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా,  విజయనగరం, శ్రీకాకుళం మరియు మన్యం పార్వతిపురం జిల్లాల ఎస్పీలు ఇతర జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.విశాఖపట్నం రేంజ్ కార్యాలయం నుండి నిర్వహించిన ఈ సమీక్షలో గంజాయి నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.అర్.ఎస్), ఎన్.బి.డబ్ల్యూ అమలు, సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు మరియు పొక్సో కేసులు, హేయమైన నేరాలు సంబంధించిన కేసులు పై సమీక్ష నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా కు పాల్పడుతున్న, గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై ప్రత్యేక షీట్స్ తయారు చేయాలన్నారు. గంజాయి ఆస్తుల స్వాధీనానికి మరియు పీ.డీ యాక్ట్ పెట్టేందుకు వివిధ గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న కేసుల పురోగతిని విశ్లేషించి, వాటి పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని డీఐజీ గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హిట్ అండ్ రన్ కేసులలో బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు సంబంధించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు.అలాగే, నేరాల నియంత్రణ, బాధితులకు న్యాయం కల్పించే దిశగా కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పోక్సో, మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి కేసులను త్వరగా విచారణకు తీసుకువెళ్లాలని, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల ఎస్పీలు తుహిన్ సిన్హా, వకుల్ జిందాల్, అమిత్ బర్దర్, కె.వి.మహేశ్వర్ రెడ్డి, ఎస్.వి.మాధవరెడ్డి, ఇతర విశాఖపట్నం రేంజ్ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *