న్యూస్ డెస్క్,(అక్షర ప్రళయం)
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు ని గెలిపించుకోవడం ఉపాధ్యాయులందరి తక్షణ కర్తవ్యం అని బహుజన టీచర్స్ అసోసియేషన్ (బి.టి ఏ.- ఏ.పి)పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు తందాడి అనిల్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొండ, సీతంపేట, భామిని మండలాలలో ఉన్నత పాఠశాలలో కళాశాలలో నాయుడు కి మొదటి ప్రాధాన్యత ఓటు (1) వేసి అత్యధిక మెజారిటీతో శాసనమండలికి పంపించాలని మనవి చేశారు అధ్యాపక ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల పరిష్కారానికి అనుభవజ్ఞులు కార్య దక్షత కలిగిన నాయకుడు శ్రీనివాసులు అన్నగారిని గెలిపించుకోవడం ఉపాధ్యాయులందరి బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్ల ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ కాయల బాల యేసు, కె రాము, గొట్టిపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు.