లీడర్ పత్రికకు ఆర్డీవో జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలి..!

పత్రికా స్వేచ్ఛపై దాడికి పాల్పడిన ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ కు జర్నలిస్టు సంఘాలు వినతి

విశాఖ కలెక్టరేట్,(అక్షర ప్రళయం)

లీడర్ దినపత్రికకు చట్ట వ్యతిరేకంగా ఆర్డీవో శ్రీ లేఖ జారీ చేసిన వారంట్ నోటీసును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు జర్నలిస్టు సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. లీడర్ పత్రికలో వచ్చిన రెండు కథనాలపై ఆ నోటీసులు జారీ చేశారని కాలం చెల్లిన సి ఆర్ పి సి చట్టం ప్రకారం ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని ఆయన దృష్టికి తెచ్చారు.రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడే సెక్షన్లు నమోదు చేస్తాం..పత్రికను ఎందుకు మూసి చేయకూడదు.. అక్రిడేషన్లు ఎందుకు రద్దు చేయకూడదు… ప్రజల శాంతి సామరస్యాలకు విఘాతం కలిగిస్తున్నారు.. అంటూ ఆ నోటీస్ లో పేర్కొనటం పూర్తిగా చట్ట రుద్దమని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పత్రికలను రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు వాటిపై ఏదైనా చర్యలు తీసుకొని అధికారం కేవలం ప్రెస్ రిజిష్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ( పి ఆర్ జి ఐ)కు,అక్రిడేషన్లు జారీ, నిలుపుదల అధికారం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలకు మాత్రమే ఉందని కలెక్టర్ కు తెలిపారు.దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్య తమ దృష్టిలో ఉందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా తమతో మాట్లాడారని,పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కొద్దిసేపు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడుకుందాం..చట్ట వ్యతిరేక నోటీసులు రద్దు చేయాలి.. ఆర్డీవో ను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ లేని అధికారాలను మీడియాపై చెలాయించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆర్డీవో పత్రికా స్వేచ్ఛపై దాడికి దిగారన్నారు. ముదపాక భూముల కుంభకోణంలో అనేకమంది పేద లబ్ధిదారులు నష్టపోయారని న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడానికి బదులు ఈ బెదిరింపు నోటీసులు ఏంటని దుయ్య బట్టారు.భూకబ్జాలు, ప్రభుత్వ అధికార్ల నిర్లక్ష్యంపై వార్తలు రాస్తే అది ప్రజల శాంతి సామరస్యాలకు ఎలా విఘాతం కలుగుతుందని ప్రశ్నించారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాపిత జర్నలిస్టు ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. సత్యనారాయణ, ఐడిజే ఎన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.నానాజీ,ఏపీయుడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు కె.చంద్రమోహన్, ఏపీజేయూ రాష్ట్ర నాయకులు ఇఎన్ఎస్ బాలు, ఏపీఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్, కార్యదర్శి బి.సురేష్, టీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.జార్జి ,జాప్ జిల్లా కార్యదర్శి కె.ఎం. కీర్తన్, ఐడిజెఎన్ ప్రతినిధులు పి.మధు, గిరి, శేషు, శ్రీనివాస్,డేవిడ్,మహిళా జర్నలిస్టులు అనుపమ యాదవ్, వరలక్ష్మి, లతా, సారా,సామ్నా కార్యదర్శి ఎం. కృష్ణ కిషోర్, ఏ ఎస్ ఎం ఐ ఎన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. కమల్ కుమార్,సీనియర్ జర్నలిస్టులు ఎం.వి. ఎస్.జి తిలక్,కె. పరశురామ్,సూర్యం, ఎస్వీ రమణ, గోగుల శ్రీనివాసరావు, బంటయ్య, పృధ్వీరాజ్, పీటర్ ప్రదీప్, చక్రవర్తి, ఎం.శ్రీహరి,శివ,సాయికుమార్, ఆర్.శ్రీనివాసు, సాయి సంతోష్, సతీష్, ఏపీఈ ఎన్ పిఏ, ఎస్ సి ఆర్ డబ్ల్యు ఏ, ఏపీఈఎంజెఏ,ఏపీఎస్ ఎస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *