వందకు పైగా కేసుల్లో అరెస్ట్…
22 కేజీలు గంజాయి..
కత్తులు రాడ్డులతో పాటు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న నర్సీపట్నం పోలీసులు…
నర్సీపట్నం,(అక్షర ప్రళయం)

నర్సీపట్నం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా విశాఖ జిల్లా గాజువాకకు చెందిన పాత నేరస్థుడు రౌతు మల్లేష్, నర్సీపట్నంకు చెందిన గెడ్డం రామ్ నవీన్ ఇద్దరూ ఏజెన్సీ నుంచి గంజాయిని కొనుగోలు చేసుకుని స్కూటీ మీద నర్సీపట్నం వస్తుండగా వాహనాల తనిఖీలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారు వద్ద 22 కేజీల గంజాయితో పాటు బంగారం కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

రౌతు మల్లేష్ మీద గాజువాక పోలీస్ స్టేషన్లో గుమ్మాని సీట్ అనగా డి.సి ఓపెన్ చేశారని, ఇతను వివిధ జిల్లాలలో దొంగతనాలు చేస్తూ పొట్టుబడి వందలకు పైగా కేసుల్లో ఉన్నాడని 66 కేసులు విచారణలో ఉన్నాయని చాలా కేసుల్లో జైలు జీవితం కూడా గడిపాడని తెలిపారు. ఇతను క్రూరత్వం కలిగిన మనిషిని పోలీసు వారు అరెస్టు చేయడానికి వెళితే వారిపై కూడా దాడి చేస్తాడని తనంతట తాను చచ్చిపోతానని బెదిరిస్తూ ఉంటాడని ఇటీవల నర్సీపట్నం ఎస్సీ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దోషం చేసిన ఘటనలోనూ అంబులెన్స్ ఆటోలను కూడా ధ్వంసం చేసిన ఘటనలోనూ రౌతు మల్లేష్ ముద్దాయని ఆ ఘటనలో నర్సీపట్నం పోలీసులు మీద కూడా దాడి చేశాడని డి.ఎస్.పి శ్రీనివాసరావు తెలిపారు.

రౌతు మల్లేష్ తో పాటు అతని అనుచరుడు నవీన్ పై గతంలో దొంగతనాలతో పాటు గంజాయి కేసులు కూడా నమోదయ్యాయని ఆయన తెలిపారు… రౌతు మల్లేష్ ఇద్దరు కుమారులు కూడా నేర ప్రవృత్తి కలవారని వీరు కూడా పలు హత్యయత్నం కేసుల్లో ముద్దాయిలుగా ఉండి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నట్లు డి.ఎస్.పి శ్రీనివాసరావు తెలిపారు. రౌతు మల్లేష్, అతని అనుచరుడు నగేష్ ను అరెస్ట్ చేసిన ఘటనలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి డిఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందజేశారు.