నకిలీ పోలీసులతో జాగ్రత్త

ద్వారక  ఏసిపి అన్నేపు నరసింహమూర్తి

ఎంవీపీ కాలనీ,(అక్షర ప్రళయం)

విలేకరుల సమావేశంలో ద్వారక  ఏసిపి అన్నేపు నరసింహమూర్తి మాట్లాడుతూ పోలీస్ అని చెప్పి మోసాలకి పాల్పడుతున్న వ్యక్తిని ఎంవిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీస్ సీజ్డ్ వాహనాలు ను ఇప్పిస్తానని ప్రజలను మోసం చేసిన బాజీ జంక్షన్ లో ఉంటున్న లోచన్ కుమార్ ను అరెస్ట్ చేసామని తెలిపారు లొచన్ కుమార్ అనే వ్యక్తికి గతంలోలో గోపాలపట్నం, ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో పలు కేసులు నమోదు అయి ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల పై  ప్రజలు అప్రమత్తంగా ఉండా లని కోరారు గతంలో పోలీసు అధికారులతో తీసుకున్న ఫోటోలు పేపర్ క్లిప్పింగ్స్ చూపించి ప్రజలు దగ్గర డబ్బులు వసూలు చేశాడని పోలీస్ సీజ్డ్ వాహనాలు ఇప్పిస్తామని నమ్మబలికి సుమారు 69000 వసూలు చేశాడని వాటిని రికవరీ చేశామని తెలిపారు. అపరిచితుల వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎసిపి అన్నెపు నరసింహమూర్తి విజ్ఞప్తి చేశారు ఇలాంటి వ్యక్తులు పట్ల పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు ఈ సమావేశంలో ఎంవిపి పోలీస్ స్టేషన్ సిఐ
జె.మురళి,ఎస్సై ధనుంజయ నాయుడు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *