కూటమిదంతా ఫెయిల్యూర్ పాలన…
దక్షిణ వైసీపీ సమన్వయకర్త గణేష్ కుమార్ ..
విశాఖ దక్షిణం,(అక్షర ప్రళయం)
విశాఖ జిల్లా ఫైర్ బ్రాండ్ రోజాగా పిలవబడే వైఎస్ఆర్సిపి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి రోజా రాణి కి వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 10,000 ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు.
సోషల్ మీడియా లో జరగుతున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి రోజారాణి తన గోడును వైఎస్ఆర్సిపి దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి విన్నవించుకున్నారు. అశీలమెట్ట కార్యాలయంలో బుధవారం ఉదయం వాసుపల్లి గణేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి నేతలపై కక్షపూరితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారన్నారు. రోజా రాణిపై అనుచిత వ్యాఖ్యలతోపాటు, మహిళా అని చూడకుండా న్యూడ్ ఫోటోలు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్న మైకంలో ఎవరైనా సరే నాయకులు మాట్లాడతారని, దానిని కక్షపూరితంగా వ్యవహరించి ఈ విధంగా దిగజారడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయంలో అందరూ డబ్బులు ఉన్నవాళ్లే రారని, నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్లు ప్రజాసేవకే వస్తారన్నారు. నిజమైన ప్రజాసేవకే వచ్చిన తమ నేతలకు పార్టీతోపాటు తాను ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నేడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత మొదలయ్యిందో తేలిపోయిందన్నారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా గెలిచిన అభ్యర్థి కూడా తమ మద్దతు వల్లే గెలిచారని కూటమి నేతలు ప్రగల్బాలు పలకడం హాస్యాస్పదమన్నారు. అధికారం ఉందని ప్రజల పక్షాన నిలబడుతున్న వైఎస్ఆర్సిపి నేతలపై అక్రమ కేసులు అరెస్టులకు పూనుకుంటున్నారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ప్రజల సమస్యలు, సంక్షేమంపై దృష్టి సారించాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ విశాఖ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సకలబత్తుల ప్రసాద్, 29 వ వార్డ్ అధ్యక్షులు పీతల వాసు,33వ వార్డ్ అధ్యక్షులు ముత్తాబుత్తుల రమేష్,42 వ వార్డ్ అధ్యక్షులు భీశెట్టి ప్రసాద్, సౌత్ మహిళా అధ్యక్షులు వాసుపల్లి బంగారమ్మ, భాను, సౌత్ యువజన విభాగం అధ్యక్షులు తాడి రవితేజ, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకుల శ్యామ్, సోషల్ మీడియా అధ్యక్షులు భేవర మహేష్, కల్చరల్ వింగ్ అధ్యక్షులు సూర్య నాయుడు, మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు అప్పారావు, చింతకాయల వాసు, రామరాజు,చేపల రాజు తదితరులు పాల్గొన్నారు.