డిపిఓలకు అందిన ఉత్తర్వులు….
అమరావతి (అక్షర ప్రళయం)
రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ చర్చిలపై పంచాయితీ అధికార్లు సమగ్ర విచారణ జరిపి చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధిశాఖ కమిషనర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయి తీల పరిధిలో నిర్మించిన క్రైస్తవ చర్చిలు జిల్లా కలెక్టర్ల అనుమతులు కలిగి ఉన్నాయా లేవా అని నిర్ధారణ చేసుకోవాలని లేని పక్షంలో ఆ చర్చిలపై కఠిన చర్యలు చేపట్టా లని 26 జిల్లాల కలెక్టర్లుకు ఉత్తరువులు పంపారు. ఈ ఉత్తర్వులు కలెక్టర్ కార్యాల యం నుంచి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాలకు చేరనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 11 వార్డ్ కు చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి ఫిబ్రవరి 3న క్రైస్తవ చర్చిలు పి ఆర్ ఆర్డి యాక్ట్ 376 ప్రకారం నిర్మాణాలు జరిగాయా అని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన పిఆర్ ఆర్ డి కమిషనర్ ఆనంద్ జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీచేశారు. అయితే గ్రామపంచాయతీ అధికారులు ఇకపై క్రైస్తవ చర్చిలు పై విచారణ చేపట్ట నున్నారు.