విశాఖ పశ్చిమం, మార్చ్:06(అక్షర ప్రళయం)
విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం అధ్యక్షుడు నంద కుమార్ నేతృత్వలో వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) ఎ.బి.పృధ్వీ తేజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి జోన్ పరిధిలోని పలు అంశాలపై చర్చించారు. ఏసీపీ పృధ్వీ తేజ్ మాట్లాడుతూ తన జోన్ పరిధిలోని ఫ్రెండ్లీ పోలీసింగ్ కి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు, కేసుల దర్యాప్తులో కూడా వివక్షతకు తావులేని విధానాల్ని అమలు చేస్తున్నామని తెలిపారు. సాంకేతికంగా కూడా ముందుకు వెళ్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఏసీపీ పృధ్వీ తేజ్ ను కలిసిన వారిలో విశాఖ క్రైమ్ జర్నలిస్ట్స్ ఫోరం సభ్యులు సురేష్, రవి, నరసింహం, సూర్య ప్రకాష్, ప్రభాకర్, గురవా రెడ్డి, హరి తదితరలు పాల్గొన్నారు.