గుడివాడ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అరెస్టు చేసిన వన్ టౌన్ పోలీసులు..
మాజీ ఎమ్మెల్యే వాసుపల్లిని సంప్రదించిన కార్యకర్త కుటుంబ సభ్యులు…
అరెస్ట్ అయిన కార్యకర్తను విడిపించిన వాసుపల్లి..!
విశాఖ దక్షిణం,(అక్షర ప్రళయం)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నాయకుల పై కార్యకర్తలపై అలాగే సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు పెరిగిపోయావని విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసిపి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించకుండా వైసిపి కేడర్ను టార్గెట్ చేయడం ప్రారంభించిందని దుయ్యబట్టారు. ఇప్పటికే పలువురు నాయకుల పైన కార్యకర్తల పైన సోషల్ మీడియా కార్యకర్తల పైన తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే గుడివాడ నియోజకవర్గం సంబంధించిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్యామ్ సుందర్ అనే యువకుడును విశాఖ వన్ టౌన్ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆరోపించారు.శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులు పరిస్థితిని తెలుసుకొని వారికి పార్టీ అండగా నిలబడాలని భావించి వెంటనే అతనికి షూరిటీ ఇప్పించి 41 నోటీసు ద్వారా తక్షణమే విడిపించడం జరిగిందన్నారు.
అప్రమత్తమైన వైసీపీ క్యాడర్…
గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్యాంసుందర్ విశాఖ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేయడంపై స్పందించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెంటనే నియోజకవర్గ వైసీపీ నాయకులను అప్రమత్తం చేసి తక్షణమే పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లవలసిందిగా చెప్పడం జరిగింది.వైసీపీ బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భారత్, 29వ వార్డు అధ్యక్షులు పీతల వాసు, 33 వ వార్డు అధ్యక్షులు ముత్తా బత్తుల రమేష్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు తాడి రవితేజ, నియోజకవర్గ సోషల్ మీడియా ప్రెసిడెంట్ బేవర మహేష్, కంటుముచ్చు సాగర్, కల్చరల్ వింగ్ అధ్యక్షుడు సూర్య, సోషల్ మీడియా ఆక్టివేట్ గోపిరాజు వంక తదితరులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ సీఐతో మాట్లాడి షిరిడి ఇప్పించి 41 నోటీసు ద్వారా శ్యామ్ సుందర్ ను విడిపించడం జరిగింది.ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు అలాగే నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.