శ్రీకాకుళం,(అక్షర ప్రళయం)

మరణ అనంతరం నేత్రదానం చేయటం వలన ఒక దాత యొక్క నేత్రములు ఇరువురికి చూపు ప్రసాదించే మహాభాగ్యం కలుగుతుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ గౌరవ చైర్మన్ పి.జగన్మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళం పట్టణం మంగువారితోటకు చెందిన గుడ్ల లక్ష్మణరావు 69 సంవత్సరములు, ఎల్ బి ఎస్ కాలనీకి చెందిన వడ్డీ పద్మావతి వయసు 80 సంవత్సరములు, వీరి కుటుంబ సభ్యులు ప్రోత్సాహంతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ద్వారా దాతల నుండి కార్నియాలను సేకరించి విశాఖపట్నం నందు ఉన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోజిన్ ఐ బ్యాంక్ వారికి కార్నియాలని అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు మేనేజర్ కే సత్యనారాయణ, నేత్ర సేకరణ, ఐ టెక్నీషియన్, పి సుజాత, ఏపీ ఆర్ వో ఉమాశంకర్ కుటుంబ సభ్యులు గుడ్ల సూర్యారావు, గుడ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.