నిష్ణాతులైన మహిళలకు సన్మానము

విశాఖపట్నం(అక్షర ప్రళయం)

అంతర్జాతీయ మహిళా దినోత్సవపు వేడుకలు సందర్బంగా..మహిళా ఓ మధుర భావన. నిష్ణాతులైన మహిళలకు సన్మానము. మహిళా సాధికారతే ప్రధాని మోదీ లక్ష్యము.కే.మలయవాసిని విశ్రాంత ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ అకాడమీ .భారతీయ జనతా పార్టీ పద్మనాభ మండల విభాగము .రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్, ప్రకృతి చికిత్సలయము మహారాణిపేట విశాఖపట్నం సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పద్మనాభం సెంటర్లోని మండల బిజెపి కార్యాలయ ఆవరణలో జరిగాయి.

ఈ కార్యక్రమానికి పద్మనాభ మండల బిజెపి అధ్యక్షురాలు తమాటపు నాగమణి అధ్యక్షత వహించింది. ఈ సందర్భంగా నాగమణి ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాయని డ్వాక్రా గ్రూపులు ఏర్పాటుకు ఆధ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు.ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కే.మలయవాసిని ముందుగా వివద రంగాలలో నిష్ణాతులైన మహిళలను సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ వివిధ దేశాలలో వివిధ తేదీలలో అంతర్జాతీయ మహిళా దినంగా జరుగుతున్న ప్రస్తుతం భారతావనిలో మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రపంచ జనాభాలో పురుషులతో సమానంగా ఉన్న మహిళకు కూడా ఆర్థికపరమైన సమానత్వం, విద్యా సాధికారత, ఓటు హక్కు మొదలైన వాటి కోసం మహిళలే గొంతు ఎత్తి కార్యారంగంలో దిగి క్రియాశక్తిగా యుక్తితో పోరాడిన మహిళల కృషికి గుర్తింపుగా ఈ మహిళ దినోత్సవం జరుపుకుంటున్నాము. భారత దేశంలో మాతా శిశువుల సంక్షేమము, మహిళా సాధికారత, ఆడపిల్లల అభ్యుదయ వంటివి సాధిస్తూ లింగ వివక్షతతో మహిళలను తక్కువ చేయవద్దని సమానంగా గౌరవించాలని 2024లో మహిళలను పెట్టుబడులలో భాగస్వామ్యం చేయడంతో దేశాలు ఎంతో పురోగతిని సాధించాయి. డిజిటల్ వరల్డ్ లో ప్రవేశించిన స్త్రీలలో దాగిన సృజన శక్తికి గ్రూపు లీడర్లుగా సీఈవోలుగా ఉన్నాము. హెచ్ పి, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలను సమర్ధవంతంగా నడుపుతున్నారు భూగోళం నుండి అంతరిక్షము వరకు స్త్రీ శక్తి ఎదిగింది ఇంత సాధించిన ఇంకా సాధించవలసినది ఎంతో ఉంది. ఈ సంవత్సరము ఐక్యరాజ్యసమితి పైన చెప్పిన కార్యక్రమాలను పూర్తి చేసి దేశాభివృద్ధికి , మహిళా సాధికారత కోసం కృషి చేయాలి అని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా వక్తలుమండల పంచాయతీ రాజ్ గ్రామీణ విస్తరణ అధికారి మీనా కుమారి, డాక్టర్ కె అన్నపూర్ణ , శృంగవరపుకోట జడ్పీహెచ్ఎస్ స్కూల్ టీచర్ డాక్టర్ స్వప్న, రెడ్డిపల్లి గ్రామ సెక్రటరీ గారైన నూర్జహాన్, స్థానిక ప్రెసిడెంట్ అయినా తాలాడ పాప, ఎంపీటీసీ కౌంటుబోతు లక్ష్మి నాయుడు, ఆనందపురం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు విజయ గారు మొదలగు వారు మహిళలు సాధిస్తున్న విజయాల గురించి, మహిళా సాధికారత గురించి విపులంగా ప్రసంగించారు. ముఖ్య అతిథి మలయవాసిని గారిని తమటపు నాగమణి ఘనంగా సాలువ కప్పి పూలమాలవేసి మొమెంటుతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రూపాకుల రవికుమార్, బిజెపి నేతలు రెడ్డిపల్లి శ్రీనివాసరావు, ఉప్పాడ అప్పారావు, కలగర్ల పేర్రాజు, సిరపురపు వెంకట్రావు, ఎం సోమేశ్వరరావు, పాలూరి కృష్ణారావు, ఎం గౌరీ రెడ్డి, అయినాడా అప్పన్న, గౌరప్పారావు, బర్ల కనక, బాలాజీ, గణేష్ ఈ కార్యక్రమంలో పెంట, కొవ్వాడ, అనంతవరము, బర్లపేట, రేవిడి, అయినాడా, రెడ్డిపల్లి మొదలగు గ్రామాల నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *