కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న చల్లా రామయ్య
బాపట్ల(అక్షర ప్రళయం)
తెలుగు రాష్ట్రం ఆంధ్రుల హక్కు అని నినాదాలిచ్చి ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా బాపట్లలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి బాపట్ల వైఎస్ఆర్సిపి దివ్యాంగులు విభాగం అధ్యక్షులు మరియు సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల్లా రామయ్య విలేఖరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సాధకుడు పొట్టి శ్రీరాములు అని తెలుగు రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేమని తెలియజేస్తూ మన ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాలలో పొట్టి శ్రీరాములు పేరును కీర్తిస్తూ ఆయన చరిత్రను ప్రతి ఒక్కరూ చదివేలా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయించాలని చల్లా రామయ్య డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనేజర్ రంగయ్య, డి.రాము , చల్లా చిరంజీవి, దార్ల.సురేష్,చల్లా.కొండయ్య, పెండ్రా.బాబు తదితరులు పాల్గొన్నారు.