మతం మార్చుకున్న వారిని ఎస్సీ కుల జాబితా నుండి తొలగించాలి..!

ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక

విశాఖ కలెక్టరేట్; మార్చి: 18(అక్షర ప్రళయం)

దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం అని ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు గరికిముక్కు సుబ్బయ్య  తెలిపారు. జిల్లా కేంద్రమైన విశాఖపట్నం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ కు ఈ అంశంపై మంగళవారం  వినతి పత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1950 రాష్ట్రపతి ప్రకటన మూడవ క్లాజు వివరణలో హిందూమతంలోని వివిధ కులాలకు చెందిన శతాబ్దాలుగా సామాజిక వివక్షతకు అంటరానితనానికి అవమానాలకు గురైన వారిని ఎస్సీలుగా పరిగణించబడతారని స్పష్టంగా ఉందన్నారు. దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాలలో చేరిస్తే దాని పరిణామం దళిత హిందూ దళిత సమాజం పై తీవ్ర ప్రభావం చూపుతుందని వారి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయ రంగాలలో ఎస్సీలు పూర్తిగా వెనుకబడిపోతారని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన దీర్ఘకాల పోరాట ఫలితం వృధా అవుతుందని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లు పొందుతూ మతం మార్చుకున్న క్రైస్తవులకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించడానికి వీలులేదని అనేక సందర్భాలలో ఉన్నత న్యాయస్థానాలు పలుమార్లు స్పష్టంగా తీర్పులు ఇచ్చినవి తెలియజేశారు. షెడ్యూల్ కులాలలో కూడా చాలామంది మతం మార్చుకొని రిజర్వేషన్ పొందుతున్నారు అలాంటి వారి వల్ల నిజమైన ఎస్సీ లబ్ధిదారులు రాజ్యాంగ ఫలాలు పొందలేకపోతున్నారు మతం మార్చుకున్న వారిని ఎస్సీ కుల జాబితా నుండి తొలగించాలని నిజమైన ఎస్సీ కులాల వారికే ప్రయోజనాలు అందేటట్లు చూడాలని అదికారులకు  వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వేదిక విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి శంకరావు, జిల్లా ఉపాద్యక్షులు చొక్కాకుల రాంబాబు, విజయనగరం జిల్లా అధ్యక్షులు పల్లికల శ్రీనివాసరావు, కటారి రమేష్, దశమంతుల సుశీల, జి.రమా, శ్రీనివాసరావు, నరసింహ, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *