- మార్చి 22 రాత్రి 8.30 గంటల నుండి 9.30 వరకూ విద్యుత్తు ఉపకరణాలు ఆపండి
- 190 దేశాలలో అమలవుతున్న ధరిత్రి గంటను జయప్రదం చేయండి
- భూ గ్రహం మీద సమస్త జీవరాశి జీవించడానికి సహకరించండి.
- జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ
విశాఖ తూర్పు, మార్చి:21(అక్షర ప్రళయం)
నీటిని తెలివిగా వాడండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. ఈమేరకు ఎమ్ వి పి కాలనీ లోని విలేకరులతో శుక్రవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 22 వ తేదీ శనివారం రాత్రి 8.30 గంటల నుండి 9.30 వరకూ విద్యుత్తు ఉపకరణాలు ఆపండని కోరారు. 190 దేశాలలో అమలవుతున్న ధరిత్రి గంటను జయప్రదం చేయండని, భూ గ్రహం మీద సమస్త జీవరాశి జీవించడానికి కృషి చెయ్యాలి అని కోరారు. ఈ సంవత్సరం ప్రపంచ జల దినోత్సవంతో సమానంగా ‘నీటిని తెలివిగా వాడుకోండి’ అనే థీమ్తో ధరిత్రి గంటను నిర్వహించటం జరుగుతుందన్నారు. ఇది శక్తి వినియోగం, నీటి సంరక్షణ మధ్య సంబంధాన్ని నొక్కి చెబుతుందని వివరించారు. 190 దేశాలు, భూభాగాల నుండి ప్రజలు ఒక గంట పాటు అన్ని అనవసరమైన లైట్లను ఆపివేయడానికి కలిసి రావడం, ఇది సమిష్టి చర్య యొక్క శక్తిని చూపిస్తుంది న్నారు. భారతదేశంలో, ఎర్త్ అవర్ యొక్క ముద్ర ప్రతి సంవత్సరం పెద్దదిగా పెరుగుతూనే ఉంది. ఐకానిక్ ల్యాండ్మార్క్లు, స్మారక చిహ్నాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యాపారాలు, సంఘాలు భూ గ్రహం మీద సమస్త జీవరాశి పరిరక్షణకు తమ మద్దతును చూపించడానికి సంపూర్ణ ఐక్యతతో స్విచ్ ఆఫ్ ఈవెంట్ను జరుపుకుంటారు అన్నారు. అలాగే నీటి పట్ల వివేకం కలిగి ఉండండన్నారు. శీతోష్ణస్థితి మార్పు, మానవ కార్యకలాపాలు ప్రపంచ నీటి ప్రవాహాలకు, వాటిపై ఆధారపడిన అన్ని జీవితాలకు భయంకరమైన ముప్పును కలిగిస్తున్నందున విషయం ప్రతి ఒక్కరికీ అర్థం అవ్వాలి అన్నారు. ఈ ఎర్త్ అవర్లో మన చర్య యొక్క సమిష్టి శక్తి ప్రభావవంతమైన నీటి సంరక్షణ నిర్వహణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.