సి.పి., డా.శంఖబ్రత బాగ్చి ఐ.పి.ఎస్..
విశాఖ దక్షిణం, ఏప్రిల్ (అక్షర ప్రళయం)

విశాఖపట్నం కమీషనర్ ఆఫ్ పోలీస్ డా.శంఖబ్రత బాగ్చి ,ఐ.పి.ఎస్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ తో కలిసి విశాఖపట్నం నగర పోలీసులు బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసే వారిపై మరియు విద్యా సంస్థలకి 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి తగు ప్రాతిపదిక రూపొందించారు.సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (సి.ఓ.టి.పి.ఏ)ని ప్రభావవంతంగా అమలు చేయడానికై, జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (ఎన్. టి సి.పి) మరియు రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ సంబంధ్ హెల్త్ ఫౌండేషన్ వారి సహకారంతో జిల్లాలోని పోలీసు అధికారులకి విశాఖ నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు సమగ్ర శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం లో పొగాకు వ్యతిరేకంగా పోరాడటంలో పోలీసు అధికారులందరూ పొగాకు కు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ ఆఫ్ పోలీస్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., మాట్లాడుతూ పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 48 వేల మరణాలు సంభవిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. (సి.ఓ.టి.పి.ఏ) పైన నిర్వహించిన ఈ శిక్షణా తరగతులు పోలీసు అధికారులకు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడుతుందన్నారు. కాట్పా చట్టం లోని సెక్షన్ 6 (బి) ప్రకారం విద్యాసంస్థలకి 100 యార్డులు (300 ఫీట్ల) పరిధిలో పొగాకు విక్రయించడం నిషేధం అని తెలిపారు. పెద్ద వయస్కుల వారు పొగాకు వ్యసనపు విషపు కోరల్లో చిక్కుకున్నప్పటికీని, పిల్లల్ని పొగాకు వ్యసనపరులు కాకుండా రక్షించడం మరియు వాళ్ళని పొగాకు ఉత్పత్తులకు అలవాటు కాకుండా నిరోధించడం మన కర్తవ్యం అని తెలిపారు.ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఏ.పి పోలీసుల నిబద్ధతను అభినందిస్తూ, డాక్టర్ ఉమాశంకర తంత్రవాహి- మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నం మరియు వాయిస్ ఆఫ్ టోబాకో విక్టిమ్స్ (వి.ఓ.టి.వి)
పాట్రన్ మాట్లాడుతూ, 90% నోటి మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్లు నేరుగా పొగాకు ఉత్పత్తుల వాడకం వల్లనే కారణం అవుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు వాడకాన్ని అరికట్టడంలో రాష్ట్రంలోని వైద్యులందరూ చేస్తున్న సమిష్టి కృషి కంటే పోలీసులు అమలు చేసే నివారణ చర్యలు ఎక్కువమంది ప్రాణాలను రక్షించగలవని ఆయన వ్యాఖ్యానించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20% పెద్దలు (15 సంవత్సరముల పైబడిన వాళ్లు) ఏదో ఒక రూపంలో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటున రోజుకి 250 కంటే ఎక్కువ మంది పిల్లలు పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రారంభిస్తున్నారు కాగా భారతదేశంలో సగటున రోజుకి 5,500 మంది పిల్లలు ప్రతిరోజు పొగాకు వాడకాన్ని ప్రారంభిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది వాటికి బానిసలుగా మారుతున్నారు. అంతేకాకుండా జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం ఎవరైనా మత్తు కలిగించే పదార్థాలు లేదా మద్యం లేదా పొగాకు ఉత్పత్తులు లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని కలిగిన ఉత్పత్తులని తగిన అర్హత కలిగిన వైద్యుల ఆదేశానుసారం తప్ప ఇంకా ఏ ఇతర సందర్భాల్లోనైనా పిల్లలకు ఇచ్చిన లేదా ఇవ్వడానికి కారణమైనా వారికి ఏడేళ్లు వరకు కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది మరియు లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుంది. ఈ ప్రయత్నాలకు అనుగుణంగా కమీషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం నగర పరిధి లోని అన్ని పోలీస్ స్టేషన్లలో “నో స్మోకింగ్” బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాట్పా చట్టం లోని సెక్షన్ -4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధంప్రమోద్ కుమార్, ప్రాజెక్ట్ మేనేజర్- సంబంధ్ హెల్త్ ఫౌండేషన్ (సి.ఓ టి.పి.ఏ) చట్టం & దాని ప్రభావవంతమైన అమలుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ అందించారు.డా.పూర్ణేందర్ రావు, జిల్లా అదనపు వైద్యారొగ్యశాఖాధికారి – విశాఖపట్నం గారు గ్లోబల్ యూత్ టొబాకో సర్వే
(జి.వై.టి.ఎస్) యొక్క ఫలితాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని 13 నుంచి 15 సంవత్సరాల వయస్సు వారిలో 33.6% మంది పొగాకు వినియోగదారులుగా ఉన్నారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఆరోగ్య మరియు విద్యాశాఖలు అన్ని జిల్లాల్లో పొగాకు రహిత విద్యాసంస్థ(టి. ఓ.ఎఫ్.ఈ. ఐ.)కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు.అదనపు డీసీపీ(అడ్మిన్) డాక్టర్ వి.బి. రాజ్ కమల్ ,శివకృష్ణ పల్లె, డిప్యూటి మేనేజర్ సంబంద్ హెల్త్ ఫౌండేషన్, & వైజాగ్ పోలీస్ కమిషనరేట్ లోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్ అధికారులు, రాష్ట్ర – జిల్లా స్థాయి వైద్యశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.