పాయకరావుపేట నియోజక వర్గాన్ని అభివృద్ధి హబ్‌గా తీర్చిదిద్దుతాం

హోం మంత్రి వంగలపూడి అనిత..

పాయకరావుపేట,(అక్షర ప్రళయం)

పాయకరావుపేట పంచాయతీ రాజ్ అతిథిగృహంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాయకరావు పేట నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు సమీక్షా సమా వేశానికి ముందుగా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా మంత్రి అనిత ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, రానున్న పది సంవత్సరాల్లో పాయకరావుపేట విశాఖ, గాజువాక తరహాలో అభివృద్ధి చెందబోతుందని, అనకాపల్లి జిల్లాలో అత్యధిక వనరులు ఉన్న నియోజకవర్గం పాయకరావుపేట అన్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని, ఆయన నాయకత్వంలో పాయకరావుపేట నియోజకవర్గానికి బల్క్ డ్రగ్ పార్క్, స్టీల్ ప్లాంట్ వంటి ప్రధాన పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు బల్క్ డ్రగ్ ప్రాజెక్టు పూర్తి అయితే రూ. 11 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, దీంతో యువతకు భారీగా ఉద్యోగావకాశాలు లభించ నున్నాయని చెప్పారు గత ఐదేళ్ల పాలనను మంత్రి అనిత తీవ్రంగా విమర్శించారు.ఇప్పుడు మళ్లీ పాయకరావుపేటను జీరో స్థితి నుంచి అభివృద్ధి దిశగా తీసు కెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆమె అన్నారు 2014 నుంచి 2019 వరకు రూ.1500 కోట్లతో పాయక రావుపేట అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టును ‘జీవనాడి’గా పేర్కొంటూ పోలవరం పనులు త్వరలో పూర్తి అవుతాయన్నారు.గత ఐదేళ్లలో ఇరిగేషన్ రంగం తీవ్రంగా గాడితప్పిందని చెప్పారు. ఇప్పుడు 2047 విజన్‌కు అను గుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, త్వరలో ఇంటింటికి కులాయి ద్వారా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *