ఇంటర్ ఫలితాల్లో “డాక్టర్ హిమశేఖర్”కాలేజీ విద్యార్థులు విజయకేతనం

అనకాపల్లి.(అక్షర ప్రళయం)

స్థానిక అనకాపల్లి గవరపాలెం శంకర్ కోలనీ లో గల డాక్టర్ హిమశేఖర్ కాలేజీ విద్యార్థులు ఈ రోజు విడుదల అయిన ఇంటర్ ఫలితాలలో అత్యున్నత ప్రతిభ చూపారు, ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగం లో యు.దేవి గాయత్రి 987,ఎస్.తరుణ్ 983,ఎ.లిఖిత 983,బైపీసీ విభాగం లో ఏ.పూజిత 977,కె.హేమలలిత 972,సీఈసి విభాగం లో వి. నందిని 968,ప్రధమ సంవత్సర బైపీసీ విభాగం లో పి.జ్యోష్న 440 మార్కులకి గాను 433 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలవగా,ఎంపీసీ విభాగం లో వి రవితేజ 462, జి ధరహాసిని 461,ఎమ్ఈసి లో కె.త్రివిక్రమ్ 465 మార్కులు సాధించారని హిమశేఖర్ కాలేజీ స్పెషల్ బ్యాచ్ లలో వున్న విద్యార్థులందరూ అత్యధిక మార్కులు సాధించడం తో పాటు హిమశేఖర్ కాలేజీ కి అనకాపల్లి జిల్లా లో మంచి పేరు తీసుకొచ్చారని కళాశాల ఛైర్మన్ కె సౌరబ్ ఒక ప్రకటన లో పేర్కొన్నారు,అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను ఐఐటీ అకాడమీ ప్రిన్సిపాల్ పి.సురేష్ అభినందిస్తూ క్లాస్ లో వున్న విద్యార్థులందరూ మంచి ఫలితాలు సాధించేలా మంచి ప్రోగ్రాం రన్ చేయడం, క్రమ శిక్షణ తో కూడిన విద్య ని అందించడం హిమశేఖర్ కాలేజీ కి మాత్రమే సాధ్యం అనిపించేలా ఈ ఫలితాలు ఉన్నాయన్నారు.ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.భాస్కర్, అధ్యాపకులు పూర్ణ,సతీష్,రమేష్,దుర్గారావు,నాగ శివ,శ్రీనివాస్,సురేష్, రాము,కిరణ్,హరిబాబు, నరసింగరావు,మల్లికార్జున్,ఉమా మహేష్,దివ్య,హరి ప్రియ,మంజు భార్గవి, నాగలక్ష్మి,తేజస్వి,నంధిత లు మరియు తల్లి దండ్రులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *