జనసేన పార్టీలోకి ముగ్గురు కార్పొరేటర్లు..!

ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్న కార్పొరేటర్లు..

జనసేన పార్టీ లోకి 74వార్డ్, 91 వార్డ్, 92 వార్డ్ కార్పొరేటర్లు..!

విశాఖ దక్షిణం,(అక్షర ప్రళయం)

జీవీఎంసీలో అవిశ్వాసం నెగ్గేందుకు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వ్యూహాలు ఫలిస్తున్నాయి. జీవీఎంసీ మేయర్ కూటమి ఖాతాలోకి తీసుకురావడానికి వంశీకృష్ణ శ్రీనివాస్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జనసేన పార్టీ ఇప్పటికే 11 మంది కార్పొరేటర్లు ఉండగా మరో ముగ్గురు కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేర్చేందుకు సమ్మహాలు చేస్తున్నారు. సీనియర్ నాయకులు బెహరా భాస్కర్ రావు కూడా పార్టీ కండువా కప్పేందుకు సిద్ధమవుతున్నారు. సీనియర్ నాయకులు బెహరా భాస్కరరావు, ఆయన సతీమణి 91 వ వార్డు బెహరా వెంకట స్వర్ణలత శివ దేవి , ఆయన కోడలు 92వ వార్డు కార్పొరేటర్ జ్యోత్న్స లతో సంప్రదింపులు జరిపి జనసేన పార్టీలో చేరేందుకు మార్గం సుగమనం చేశారు. అదేవిధంగా కార్పొరేటర్ తిప్పల వంశీ రెడ్డి జనసేన పార్టీ లో చేరనున్నారు.విశాఖ నగర జనసేన అధ్యక్షులు, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్, మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ,రూరల్ జనసేన అధ్యక్షులు , పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సారధ్యం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్య మంత్రి వర్యులు , జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కల్యాణ్ సమక్షం లో జనసేన పార్టీలో త్వరలో చేరనున్నారు. దీంతో జీవీఎంసీ అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీ నెగ్గేందుకు పూర్తి మెజారిటీ వచ్చినట్టే. ఇప్పటికే కూటమి కార్పొరేటర్ లో జీవీఎంసీ అవిశ్వాసంలో నెగ్గడానికి రెండు మూడు ఓట్లు తక్కువ ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అవిశ్వాసం నెగ్గడం కష్టమే నన్న తరుణంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కార్పొరేషన్ ను కూటమి ఖాతాలో వేసే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇందులో భాగంగా బెహరా భాస్కరరావు ఆయన సతీమణి కోడలు ఇద్దరినీ జనసేన పార్టీలో చేర్చడానికి సిద్ధం చేశారు. దీంతో జీవీఎంసీ మేయర్ పీఠం కూటమి పార్టీ ఖాతాలో చేరబోతుంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *